రౌతులపూడి మండలం ఎస్. అగ్రహారం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో స్థానిక నియోజకవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆమె టీడీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు.