ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పై ఎంపీ, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నోటికి వచ్చిన హామీలు ఇచ్చారని అన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. నిన్న విడుదల చేసిన ఎన్డీఏ మేనిఫెస్టోను రాష్ట్ర బీజేపీ ప్రతినిధి సిద్ధార్థ సింగ్ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును బీజేపీ నేతలు నమ్మడం లేదని అన్నారు.