మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి నరసింహం శనివారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు ఆయా కళాశాలలలో ఫీజు చెల్లింపునకు అవకాశం ఉందన్నారు. ఇంటర్ పరీక్షలు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి నుంచి తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ఐఓ తెలిపారు.