గౌతమీ జీవ కారుణ్య సంఘం ఆస్తులను కాపాడాలి

64చూసినవారు
రాజమండ్రిలోని శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీ. కే. విశ్వేశ్వర రెడ్డి ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ మట్టే నారాయణమ్మ అనే దాత 40 ఏళ్ల క్రితం ఈ సంఘానికి 19. 7 ఎకరాల స్థలాన్ని దానం చేశారన్నారు. ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని ఆస్తులను కాపాడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్