రాజమండ్రిలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలుకు స్థలం కేటాయించిన ఎంపీ భరత్కు రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు లక్కోజు వీరభద్రరావు, రాష్ట్ర నాయకుడు అనుపోజు వెంకటరమణమూర్తి మంగళవారం రాజమండ్రిలో మాట్లాడారు. కమ్యూనిటీ హాలు కావాలనే తమ కోరిక నెరవేరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.