వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను ఫూల్స్ చేస్తుందని రాజమండ్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ నగరంలో పంపిణీ చేసిన ఇళ్ళ పట్టాలు పచ్చి బోగస్ అని, కూటమి అధికారంలోకి రాగానే వాటిని సరి చేస్తాం అని అన్నారు. సీఎం జగన్ ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.