రాజమండ్రి రూరల్: 8 కాసుల బంగారు ఆభరణాలు చోరీ

67చూసినవారు
రాజమండ్రి రూరల్: 8 కాసుల బంగారు ఆభరణాలు చోరీ
రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ వీధిలోని కిరాణా వ్యాపారి తాతారావు ఇంట్లో 8 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 25 వేల నగదు చోరీ అయినట్లు ధవళేశ్వరం సీఐ గణేష్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి నగదు, బంగారం, సెల్ ఫోన్ బ్యాగులో దాచి పైఅంతస్తులోని బీరువాలో పెట్టామని బాధితులు చెప్పారు. అర్ధరాత్రి కాలికి ఎవరో తగలడంతో లేచి చూసేసరికి దొంగ పరారయ్యాడన్నారు.

సంబంధిత పోస్ట్