తూర్పుగోదావరి: కడియం మండలం జేగురుపాడు గ్రామ శివారులో ఉన్న మెహర్ గాయత్రీ దేవి క్రాఫ్ట్ పేపర్స్ ఎల్ఎల్పీ పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. పేపర్ మిల్లు జనరల్ మేనేజర్ కంఠంశెట్టి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుపై కడియం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తులసిధర్ తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ అంబికాప్రసాద్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.