ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

57చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక శనివారం ఉపసంహరించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 12 అడుగుల నీటిమట్టం కొనసాగింది. బ్యారేజీ నుంచి 10, 36, 440 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు సంబంధించి 2, 300 క్యూసెక్కుల నీటిని వదిలారు.

సంబంధిత పోస్ట్