మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన రాజమండ్రి రూరల్ జనసేన నాయకులు

77చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలంలోని 9వ వార్డుకు చెందిన జనసేన పార్టీ నాయకులు శుక్రవారం మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం, ఆయన మంత్రి కావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ మండలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్