మహాత్మా గాంధీజీ మనందరికి నిత్య స్ఫూర్తి

54చూసినవారు
మహాత్మా గాంధీజీ మనందరికి నిత్య స్ఫూర్తి
కడియం మండలం మురమండలో మహాత్మా గాంధీజీ జయంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత షేక్ వల్లి మీరా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మీరాభాయ్ పాల్గొని మాట్లాడారు. సత్యం, ధర్మం, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపిన బాపూజీ మనందరికి నిత్య స్ఫూర్తి అన్నారు.

సంబంధిత పోస్ట్