కడియం: దసరా మహోత్సవాలలో పాల్గొన్న మంత్రి దుర్గేష్

69చూసినవారు
కడియం: దసరా మహోత్సవాలలో పాల్గొన్న మంత్రి దుర్గేష్
కడియంలోని దేవి చౌక్ సెంటర్లో జరుగుచున్న దసరా మహోత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దయ అందరి పైన నిండుగా ఉండాలని ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్