రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారని జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ సోమవారం తెలిపారు. కాగా ప్రధాన అభ్యర్థులుగా కూటమి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కాంగ్రెస్ నుంచి బాలేపల్లి మురళీధర్ బరిలో ఉన్నారు.