పిఠాపురం నియోజకవర్గంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన యు. కొత్తపల్లి మండలంలోని నవ కండ్రవాడ, కొండవరం, ఇసుకపల్లి, నాగులపల్లి, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.