జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా జక్కంపూడి కుటుంబంపై విమర్శలు చేయడం బాధగా ఉందని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాజానగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఇచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్ చదివి వెళ్లిపోయారని ఆరోపించారు.