రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో మంగళవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పూల బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల మొదలైన వారు పాల్గొన్నారు.