రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ టిడిపి ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిల ఆధ్వర్యంలో కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద గురువారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఓటు కూడా జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాస్ గుర్తుపై వేసి బలరామకృష్ణని గెలిపించాలని కోరారు.