కూటమి ప్రభుత్వం హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు. అడ్డతీగల మండలం డి. భీమవరం-వీరంపాలెం గ్రామానికి రూ. 3. 20కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు ఆమె సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ. నియోజకర్గంలో ప్రతీ గిరిజన గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తమ ధ్యేయమన్నారు. అన్ని గ్రామాలకు రహదారి కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు.