ఎమ్మెల్యే కృష్ణంరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

60చూసినవారు
రాజ్యాంగ సృష్టికర్త చిత్ర పటాన్ని అవమానపర్చిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలో దళితులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. దీనిలో భాగంగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత ద్రోహి కృష్ణంరాజు అంటూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్