వరద ముంపులో బ్రిడ్జి.. రాకపోకలకు ఇబ్బంది

80చూసినవారు
సఖినేటిపల్లి నుంచి అప్పనరాముని లంక వెళ్లే కొత్త బ్రిడ్జి గోదావరి వరద ఉద్ధృతికి బుధవారం ముంపు బారిన పడింది. బ్రిడ్జిపై నుంచి సుమారు మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వంతెనపై రాకపోకలు నిలిపివేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్