సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మాలల నిరసన

56చూసినవారు
రాజ్యాంగాన్ని విస్మరించి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మాలల న్యాయ పోరాట సమితి, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సఖినేటిపల్లి 3 తూములు వద్ద సోమవారం అంబేడ్కర్ విగ్రహం నుంచి వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వర్గీకరణను తీవ్రంగా తప్పుపట్టారు.

సంబంధిత పోస్ట్