మలికిపురం: ప్రజలకు వైసీపీ అండగా ఉంటుంది: మాజీమంత్రి

75చూసినవారు
మలికిపురం: ప్రజలకు వైసీపీ అండగా ఉంటుంది: మాజీమంత్రి
వైసీపీ ప్రజలకు అనుక్షణం అండగా ఉంటుందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. మలికిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రహ్మాజీ, భగవాన్, శ్రీను, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్