క్షణికావేశంలో ఆత్మహత్యలు వద్దు: ప్రిన్సిపల్

64చూసినవారు
మలికిపురం మహిళా కళాశాలలో మంగళవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో భాగంగా అవగాహన సదస్సు జరిగింది. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం వల్ల నూరేళ్ల జీవితం అర్థంతరంగా ముగిసిపోతుందని ప్రిన్సిపల్ సుధ పేర్కొన్నారు. అభద్రతా భావానికి లోను కాకుండా మహిళలు ధైర్యంగా ఉండాలని హితబోధ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్