రాజోలు: కనకదుర్గ ఆలయంలో ఘనంగా సరస్వతి పూజ

50చూసినవారు
రాజోలు మండలం కూనవరం కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన సరస్వతి పూజలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారి మూలా నక్షత్రం కావటంతో సరస్వతీ పూజను ఘనంగా జరిపించారు. విద్యార్థులతో పాటు పేరెంట్స్ పూజలో పాల్గొని చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల చేత సరస్వతీ పూజ జరిపించారు.

సంబంధిత పోస్ట్