వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ అన్నారు. సోమవారం తుని పట్నంలోని 15వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ ఏలూరు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.