Mar 29, 2024, 14:03 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు స్వాధీనం
Mar 29, 2024, 14:03 IST
నారాయణపేట జిల్లా మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు పట్టుకున్నట్లు సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన బిరప్ప అనే వ్యక్తి 8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. నగదును ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామని పేర్కొన్నారు.