బాల బాలాజీ స్వామి ఆలయ ఆదాయం వివరాలు
మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 2, 76, 000 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ మాధవి తెలిపారు. ఉదయం నుండి 3097 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2416 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు.