హయాంలోనే కాపులకు సంక్షేమ లబ్ధి
సీఎం వైఎస్ జగన్ హయాంలోనే కాపులకు సంక్షేమ లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి ముమ్మిడివరంలోని జగతా బాబ్జీ ఇంటి ఆవరణలో వైఎస్సార్ సీపీ కాపుల ఆతీయ సమావేశం జరిగింది. తన రాజకీయ జీవితానికి తోట త్రిమూర్తులు, తాడి తాతారావులు బీజం వేశారన్నారు. కాపులు వైఎస్సార్ సీపీకి నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్నారన్నారు. కాపు జాతి ఆత్మ విశ్వాసానికి నిలువుటద్దమని చెప్పారు.