జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు పంపింది. ఈ నెల 29న లేదా 31న విచారణకు హాజరు కావాలని శనివారం పంపిన సమన్లలో కోరింది. లేకుంటే ED అధికారులు ఆయన నివాసానికి వచ్చి విచారిస్తారని ఈడీ స్పష్టం చేసింది. రాంచీలోని 7.16 ఎకరాలకు సంబంధించిన భూకుంభకోణం జరిగిందని ED కేసు నమోదు చేసింది. ఈ కేసులో 9 సార్లు సీఎం సోరెన్కు సమన్లు పంపింది.