ఇంకా ముంపులో లంక గ్రామాలు

79చూసినవారు
ఇంకా ముంపులో లంక గ్రామాలు
వశిష్ట గోదావరి వరద ఉధృతి గురువారం సాయంత్రం నుంచి కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం నుంచి దిగువకు పెద్దఎత్తున నీరు విడుదల చేయడంతో వశిష్ట గోదావరి గురువారం ఉదయం ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. దీంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంది. ఆచంట మండలంలోని పుచ్చల్లంక, రాయిలంక, నకిడిలంక ముంపుబారిన పడ్డాయి. అయోధ్య లంకలో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. ఇళ్లను చుట్టుముట్టింది.

సంబంధిత పోస్ట్