ఆచంట బ్యాంకు వద్ద కౌలు రైతులు నిరసన

83చూసినవారు
ఆచంట బ్యాంకు వద్ద కౌలు రైతులు నిరసన
భూయజమానుల రుణాలతో సంబంధం లేకుండా కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆచంట స్టేట్‌ బ్యాంకు వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా ఆచరణలో కౌలు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్