చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంభం విజయరాజు శనివారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జగన్ను మరోసారి సీఎం చేద్దామని ఆయన సూచించారు.