సమగ్ర విచారణ చేసి హెచ్ఎం పై చర్యలు తీసుకోండి

85చూసినవారు
సమగ్ర విచారణ చేసి హెచ్ఎం పై చర్యలు తీసుకోండి
పెదపాలపర్రు జడ్పీహెచ్.ఎస్ పాఠశాల మాజీ హెచ్ఎం శాంతకుమారిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్ఎంసీ సభ్యులు, గ్రామస్థులు కోరారు. కైకలూరులో మంగళవారం వారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను కలిసి మాట్లాడారు. ఆమెపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు స్పందించడం లేదన్నారు. దీనిపై ఎమ్మెల్యే డీఈవో, కలెక్టర్ తో మాట్లాడి సమగ్ర విచారణ జరిగేలా చూసి చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్