ముదినేపల్లి: జగన్నాథ స్వామి ఆలయంలో శమీ పూజ

53చూసినవారు
ముదినేపల్లి: జగన్నాథ స్వామి ఆలయంలో శమీ పూజ
ముదినేపల్లి మండలం వడాలిలో చినపూరిగా ప్రసిద్ధిగాంచిన జగన్నాథస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన విజయదశమి వేడుకల్లో వైభవంగా శమీ పూజ నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు శమీ వృక్షానికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్