వరద బాధితులకు విద్యాసంస్థలు చూపిన ఆదరణ మరువలేనిది: కలెక్టర్

55చూసినవారు
వరద బాధితులకు విద్యాసంస్థలు చూపిన ఆదరణ మరువలేనిది: కలెక్టర్
పలు విద్యాసంస్థలు, విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున విరాళాలను సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి సోమవారం భీమవరం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు విరాళాలు అందజేయడంలో జిల్లాలోని వివిధ విద్యాసంస్థలు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ఇప్పటికే రెండు విడతలలో రూ. 7 00, 835 లను అందజేశారన్నారు.

సంబంధిత పోస్ట్