ఈదులగూడెంలో పోలీస్ కవాతు

581చూసినవారు
ఎన్నికల సందర్భంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే పోలీస్ కవాతు నిర్వహిస్తున్నట్లు ఆగిరిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో పోలీస్ కవాతు కేంద్ర బలగాలతో నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఎస్ఐ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్