8,637 ఎకరాల్లో వరి నాట్లు ముంపు

55చూసినవారు
8,637 ఎకరాల్లో వరి నాట్లు ముంపు
ప. గో. జిల్లా వ్యాప్తంగా 2. 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 1.99 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టారని డిఏఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల వర్షాలతో సుమారు 8, 637 ఎకరాల్లో వరి నాట్లు ముంపుకు గురై నష్టపోయారని వర్షాల కారణంగా 6, 050 మంది కర్షకులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ హెక్టారుకు రూ. 17 వేల చొప్పున పరిహారం ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపనున్నారు.

సంబంధిత పోస్ట్