విజయవాడ వరద బాధితుల సహాయార్థం టిబిఆర్ గ్రూప్స్ సీఈవో తనబుద్ధి రవి కిరణ్ తన మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు అండగా నిలిచేందుకు 50,000 విరాళాన్ని ప్రకటించారు.ఈ మొత్తాన్ని శుక్రవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసకు అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రవి కిరణ్ ను అభినందించారు.