12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు

77చూసినవారు
12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు
తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలో సుమారు 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం నిట్ కళాశాలను ఆనుకొని ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. భూమికి సంబంధించిన వివరాలను తహశీల్దార్ సునీల్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే దాతల సహకారంతో స్టేడియం అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్