తాడేపల్లిగూడెం: అధికారులు సొమ్ములు అడిగితే చెప్పండి

64చూసినవారు
తాడేపల్లిగూడెం: అధికారులు సొమ్ములు అడిగితే చెప్పండి
అధికారులంతా ప్రజల కోసం పనిచేయాలని, ఎవరైనా సొమ్ములు అడిగితే పంపించి వేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో రీ-సర్వే గ్రామసభ నిర్వహించారు. ప్రజలను కొల్లగొట్టే ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండడానికి వీల్లేదన్నారు. ‌ ప్రజలు తనను బిడ్డగా ఆదరించి అత్యధిక మెజారిటీ ఇచ్చారని, పెద్దకొడుకుగా వారి కష్టసుఖాల్లో ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్