ఉండి గ్రామానికి చెందిన పూసపాటి వెంకట్రాజు అనే ఆక్వారైతు మహదేవపట్నం గ్రామంలో ఆక్వాసాగు చేస్తున్నాడు. ఈ నెల 9 రాత్రి చెరువుపై ఉండే జనరేటర్ కోసం రూ. 50 వేల విలువైన 500 లీటర్ల డీజిలు 250 లీటర్ల చొప్పున తెచ్చి చెరువు వద్ద ఉన్న షెడ్లో పెట్టి తాళం వేశారు. 10వ తేదీ ఉదయం వెళ్లి చూడగా తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.