ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం: సీఈఓ

66చూసినవారు
ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం: సీఈఓ
ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఆదివారం సీఈఓ మాట్లాడుతూ.. ‘అన్ని ప్రాంతాలకు సిబ్బందిని పంపిస్తున్నాం. ఈవీఎంలు ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. రాత్రి 7 గంటల వరకు అందరూ కేంద్రాలకు చేరుకుంటారు. తమిళనాడు, కర్ణాటక నుంచి పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు వస్తున్నాయి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్