చంద్రబాబుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. "రాష్ట్రం అప్పులు ఊబిలో ఉందని గతంలో చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. బాబు కూటమి ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగులుతుంది. కక్ష సాధింపు చర్యలు చేసేది బాబే. పవన్ కల్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకులు గురించి మాట్లాడుకోవడం అనవసరం." అని వెల్లపల్లి అన్నారు.