ఘోర ప్రమాదం.. దంపతులు స్పాట్ డెడ్ (వీడియో)

26370చూసినవారు
తిరుపతి జిల్లా పాకాల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్