బాపట్ల రైల్వేస్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్విచ్ బోర్డులోకి నీరు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను అదుపుజేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.