ఐపీఎల్ 2025లో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంప్యాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ సాధించారు. కరుణ్ నాయర్ 22 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో కరుణ్ నాయర్కు ఇది 11వ అర్థశతకం. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి DC స్కోర్ 81/1గా ఉంది. క్రీజులో కరుణ్ నాయర్కు (52), పోరెల్ (22) ఉన్నారు.