పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్

64చూసినవారు
పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్
ఏపీలో పెన్షన్ తీసుకునేవారికి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పెన్షన్ కోసం ప్రతి నెలా ఒకటో తారీఖున స్వగ్రామానికి రాలేని వాళ్లు ఉన్న చోటనే పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో ఆప్షన్ ఓపెన్ చేసినట్లు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఆధార్ జిరాక్స్ ఇస్తే వారు బదిలీ చేస్తారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్