ఏపీలోని గుంటూరులో నకిలీ నోట్ల కలకలం రేగింది. గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు, అనపర్తి పోలీసులు.. రూ.1.06 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ సామగ్రి, జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు.