గుంటూరు ఆర్టీసీ బస్టాండులోకి చేరిన వర్షపు నీటిని అధికారులు బయటకు తోడించారు. 3రోజుల నుంచి బస్టాండులో వర్షపునీరు చేరి చెరువును తలపించింది. దీంతో అధికారులు బస్టాండులోకి ప్రయాణికుల రాకపోకలను నిలిపివేసి బీఆర్ స్టేడియం సెంటర్, విజయవాడ రోడ్డు, పల్నాడు బస్టాండు ప్రాంతాల్లో మినీ బస్టాండులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి బస్టాండులోకి ప్రయాణికుల రాకపోకల్ని అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.