విపత్కర పరిస్థితుల్లో ఉన్న విజయవాడ వాసులకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులు, సిబ్బంది అండగా నిలుస్తున్నారని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన విజయవాడను పూర్వస్థితికి తెచ్చేందుకు గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ప్రత్యేక కార్మిక బృందాలతో కృషి చేస్తున్నామన్నారు.